jharkhandHeroBanners

తాజా కథనాలు

Image

నీటి సంరక్షణ చొరవ

జార్ఖండ్ ప్రభుత్వం గత ఏడాది కరువును ఎదుర్కొన్న రాష్ట్రంలోని కరువు బాధిత రైతుల కోసం మొత్తం రూ. 467.32 కోట్లతో నీటి సంరక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. 24 జిల్లాల్లోని అన్ని బ్లాకుల్లో భూగర్భజలాల నిల్వలను పునరావృతo చేయడానికి చెరువులను పునరుద్ధరించడం మరియు ఇంకుడు గుంతలను నిర్మించడం కోసం ఈ పథకం ప్రారంభించబడింది. పథకం అవలోకనం: పథకం పేరు : నీటి సంరక్షణ చొరవ లక్ష్యం: గత ఏడాది కరువును ఎదుర్కొన్న రాష్ట్రంలోని రైతులకు ప్రయోజనాలను అందించడం ఈ పథక లక్ష్యం. పథకం ప్రారంభించిన సంవత్సరం: 2023 కేటాయించబడిన నిధి: రూ. 467.32 కోట్లు ప్రభుత్వ పథకం రకం: జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వం స్పాన్సర్డ్ / సెక్టార్ స్కీమ్: సెక్టార్ స్కీమ్ ముఖ్య లక్షణాలు: 24 జిల్లాల్లోని అన్ని బ్లాకుల్లో 2,133 చెరువులను పునరుద్ధరించడం మరియు 2,795 ఇంకుడు గుంతలను నిర్మించడం ఈ పథకం లక్ష్యం. దాదాపు 30 లక్షల మంది కరువు బాధిత రైతులకు రూ.1,200 కోట్ల సాయం అందించాలని ప్రభుత్వం యోచిస్తోంది. గత ఏడాది కరువును చవిచూసిన రైతులకు ఈ పథకం ప్రయోజనాలను అందించడంతో పాటు భూగర్భజలాల నిల్వలను పునరావృతo చేయడంలో సహాయపడుతుంది. ఇంకుడు గుంతలు వర్షపు నీటిని సంరక్షించడంలో సహాయపడతాయి మరియు ఈ ప్రాంతంలో నీటి మట్టాన్ని పెంచుతాయి. పథకం గురించి తాజా వార్తలు: జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వం చెపట్టిన ఈ నీటి సంరక్షణ చొరవను వ్యవసాయ శాఖ మంత్రి బాదల్ పత్రలేఖ్, 21 ఏప్రిల్, 2023న ప్రారంభించారు. జార్ఖండ్ వాటర్ కన్జర్వేషన్ ఇనిషియేటివ్ అనేది గత సంవత్సరం కరువును ఎదుర్కొన్న రైతులకు ప్రయోజనాలను అందించడానికి ఉద్దేశించిన రాష్ట్ర ప్రభుత్వ రంగ పథకం. రాష్ట్రంలోని 24 జిల్లాల్లోని అన్ని బ్లాకుల్లో చెరువుల పునరుద్ధరణ, ఇంకుడు గుంతలను నిర్మించడం ద్వాsరా భూగర్భ జలాల నిల్వను పునరావృతo చేయడంలో ఈ పథకం సహాయపడుతుంది.

భారతదేశపు అతిపెద్ద వ్యవసాయ వేదిక

400+

బ్రాండ్లు

30M+

రైతులకందించిన సేవలు

9K+

ఉత్పత్తులు

95%+

పిన్ కోడ్ లకు అందించిన సేవలు